Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshChandrababu Naidu | భారతీయ సంగీతానికి అజరామర స్వర సంపద.. ఎస్పీ బాలుకు సీఎం నివాళులు

Chandrababu Naidu | భారతీయ సంగీతానికి అజరామర స్వర సంపద.. ఎస్పీ బాలుకు సీఎం నివాళులు

-

Chat on WhatsApp

Chandrababu Naidu: భారతీయ సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ గాయకుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టులో బాలు సంగీత ప్రస్థానాన్ని స్మరించుకున్నారు.

అసాధారణ గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సంగీత రంగానికి అమూల్యమైన సేవలు అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సంగీతానికి బాలు అందించిన సేవలు, ఆయన పాడిన గీతాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

తెలుగు భాష, తెలుగు సంగీత చరిత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు శాశ్వత అధ్యాయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆయన స్వరం కేవలం పాటలకే పరిమితం కాలేదని, లక్షలాది మంది అభిమానుల భావోద్వేగాల్లో శాశ్వతంగా భాగమైందని వ్యాఖ్యానించారు. బాలు భౌతికంగా దూరమైనప్పటికీ, ఆయన ఆలపించిన అనేక గీతాల రూపంలో ఎప్పటికీ ప్రజల మధ్య జీవిస్తూనే ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన అపూర్వ సేవలను దేశం ఎన్నటికీ మరచిపోదని తెలిపారు. ఈ సందర్భంగా గాన గంధర్వుడిగా గుర్తింపు పొందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సీఎం మరోసారి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp