ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) – లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్లో నికోలస్ పూరన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 70 పరుగులు చేసిన పూరన్ తన బ్యాటింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 6 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడిన పూరన్, ఈ మ్యాచులో 269.23 స్ట్రైక్ రేట్తో రాణించాడు.
పూరన్ తన అర్ధశతకాన్ని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేయడంతో ఐపీఎల్లో అరుదైన రికార్డును సాధించాడు. 20 బంతుల్లోపు నాలుగు అర్ధశతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా పూరన్ పేరు నిలిచింది. ఈ జాబితాలో ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లు మూడు హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నారు.
పూరన్, మిచెల్ మార్ష్తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన పూరన్ ఇప్పటివరకు 145 పరుగులు చేశాడు. మార్ష్ 124 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.
ఈ అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. పూరన్ ఇలాంటి ఆటతీరు కొనసాగిస్తే లక్నో ప్లేఆఫ్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.