Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeInterNationalIndian Embassy | ఇరాన్‌కు వెళ్లొద్దు ?.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

Indian Embassy | ఇరాన్‌కు వెళ్లొద్దు ?.. భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక

-

Chat on WhatsApp

Indian Embassy: పశ్చిమాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులతో పాటు అక్కడికి వెళ్లాలనుకుంటున్న పౌరులకు తాజా భద్రతా సూచనలు జారీ చేసింది.

టెహ్రాన్‌లోని భారత ఎంబసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుతం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, భద్రతా అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని హెచ్చరించింది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని, తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండాలని సూచించింది.

అత్యవసర పరిస్థితులు లేకపోతే ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఎంబసీ పేర్కొంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లాల్సి వస్తే ముందుగానే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరింది. అలాగే ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అందించే సమాచారాన్ని పరిశీలిస్తూ ఉండాలని సూచించింది.

ఇక అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పరిస్థితి, అణు కేంద్రాల పర్యవేక్షణ, అంతర్జాతీయ తనిఖీల అంశాలపై ఇరు దేశాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతుండటంతో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి స్థిరత్వం ఇంకా నెలకొనలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని భారత రాయబార కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp