India T20 Squad: ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందే ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో సెలెక్టర్లు అత్యవసరంగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీంతో యువ ఆల్రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జట్టు ఎంపిక అనంతరం నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి గాయాల బారిన పడటంతో వారు ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్కు అందుబాటులో ఉండరని స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో జట్టు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని సూర్యాన్ష్ షెడ్గేను ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ ఆటగాడికి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు కూడా పెద్దపీట వేశారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలవనున్నారు. అదే సమయంలో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, సూర్యవంశీ వంటి యువ ప్రతిభలకు కూడా అవకాశాలు కల్పించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో మెరిసిన ఈ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణిస్తారన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యువత, అనుభవం కలగలిసిన ఈ జట్టుతో భారత్ ఐర్లాండ్ గడ్డపై బరిలోక. గాయాల కారణంగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ, జట్టు సమతుల్యత దెబ్బతినలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ జట్టు ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి.








