Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeOthersఐసీసీ క్రికెట్‌లో మూడు కీలక మార్పులకు శ్రీకారం

ఐసీసీ క్రికెట్‌లో మూడు కీలక మార్పులకు శ్రీకారం

-

Chat on WhatsApp

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆటలో సమకాలీనతను తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న సమావేశంలో వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లకు సంబంధించి కీలక మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి జై షా నేతృత్వం వహిస్తున్నారు. సమావేశం ఏప్రిల్ 13 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ముగింపు రోజున అధికారికంగా కొన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

వన్డేల్లో ప్రస్తుతం అమలులో ఉన్న రెండు కొత్త బంతుల నియమం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఇన్నింగ్స్‌కు రెండు వైపుల నుంచీ కొత్త బంతులను ఉపయోగించడం వల్ల పేసర్లకు స్వింగ్ సాధన కష్టంగా మారింది. దీంతో బ్యాటర్లు సులభంగా పరుగులు సాధించగలుగుతున్నారు. బౌలర్లకు సముచిత అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఐసీసీ ఈ నిబంధనను రద్దు చేయాలని భావిస్తోంది.

ఇక టెస్టుల్లో ఓవర్ల వేగాన్ని నియంత్రించేందుకు టైమర్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది. ఒక ఓవర్ పూర్తయిన వెంటనే తదుపరి ఓవర్ బంతి వేయాలన్న నిబంధన ద్వారా రోజుకు 90 ఓవర్ల నిర్వహణను ఖచ్చితంగా పాటించవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ వల్ల జరిమానాలు విధిస్తున్న విధానాన్ని టెస్టులకు కూడా విస్తరించనుంది.

మరోవైపు, టీ20 ఫార్మాట్‌కు పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని అండర్-19 టీ20 ప్రపంచకప్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇప్పటికే మహిళల విభాగంలో రెండు సార్లు ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఇప్పుడు పురుషుల విభాగంలోనూ అదే తరహాలో టోర్నీ నిర్వహించాలని ఐసీసీ సన్నద్ధమవుతోంది. ఇది యువ ప్రతిభకు వేదికగా మారుతుందని విశ్వసిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp