భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. అసలేమిటి?

After witnessing the Meerut incident, Babloo decided to marry off his wife to her lover to avoid any future harm.

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బబ్లూ అనే వ్యక్తి తన భార్య రాధికను ఆమె ప్రియుడు విశాల్‌కుమార్‌కి ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తాజాగా బబ్లూ దీనిపై స్పందిస్తూ, తన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు.

బబ్లూ మాట్లాడుతూ, “ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం చూస్తున్నాం” అని చెప్పాడు. ముఖ్యంగా మీరట్‌లో జరిగిన ఘటన తన నిర్ణయానికి కారణమైందని చెప్పాడు. ఓ యువతి తన భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆకస్మాత్తుగా నాపైనా అలాంటి ప్రమాదం వస్తుందేమో అనే భయంతోనే ఈ పెళ్లి జరిపించా” అని వివరించాడు.

2017లో బబ్లూ, రాధిక వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, రాధికకు విశాల్‌తో వివాహేతర సంబంధం ఉండటం బబ్లూకి తెలిసింది. ఈ విషయం గురించి రాధికను ప్రశ్నించినా, ప్రియుడిని వదులుకోవడానికి అంగీకరించలేదు. దీంతో తనకు హాని జరగకుండా ఉండటానికి తానే స్వయంగా రాధిక, విశాల్‌ల వివాహానికి ఏర్పాట్లు చేశాడు.

మొదట కోర్టు పెళ్లి చేయించిన బబ్లూ, ఆ తర్వాత ఒక ఆలయంలో దండలు మార్చుకునేలా చేశాడు. తన కుటుంబ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ప్రశాంతంగా జీవించగలనని బబ్లూ చెప్పాడు. ఈ ఘటనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *