
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని SRK పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ హాజరై మాట్లాడారు మహిళలకు మహిళా విద్యార్థులకు ఇష్టమైన పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. బతకమ్మ పండగ సంబరాలు సద్దుల బతుకమ్మ దసరా పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. దసరా పండగ హాలిడేస్ లో అందరూ అమ్మ నాన్నలతో ఉండి మంచిగా బతకమ్మ దసరా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దత్తాద్రి , తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.