Tamil Nadu Assembly: జాతీయ గీతం ఆలపించలేదని అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్

Tamil Nadu Governor RN Ravi leaves the Assembly amid National Anthem controversy Tamil Nadu Governor RN Ravi leaves the Assembly amid National Anthem controversy

Tamil Nadu Assembly: తమిళనాడు శాసనసభలో గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి(RN Ravi) వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభమవగా, గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.

తమిళ తల్లి ప్రార్థనా గీతం అనంతరం జాతీయ గీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు అంగీకరించకపోవడంతో ఆయన వేదికను విడిచిపెట్టినట్లు సమాచారం.

ALSO READ:India Economy Growth: 2028 నాటికి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌?

లోక్ భవన్ వర్గాల ప్రకారం, గవర్నర్ ప్రసంగానికి ముందు లేదా తర్వాత జాతీయ గీతం ఆలపించడం అనేది సాధారణ సంప్రదాయమని వెల్లడించారు.

ఈ సందర్భంలో ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నిరాకరించారని పేర్కొన్నారు. ఈ ఘటనతో శాసనసభ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.


గవర్నర్ వాకౌట్ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామం కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *