రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న మోగల్స కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు.
వివిధ వయస్సుల మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని దృష్టి సమస్యలపై వైద్యుల సూచనలు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ శిబిరం స్థానికులకు మరింత సహాయపడింది.
స్కూల్ నిర్వహణ మరియు వైద్య బృందం ప్రజలకు అవసరమైన మందులు, సూచనలు అందించారు. రిపోర్టర్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటువంటి శిబిరాలు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్వాహకులు ప్రకటించారు.
also read:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు
