Telangana Reporters
హైదరాబాద్లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లో మరోసారి వాన బీభత్సం చూపించింది. హయత్నగర్, వనస్థలిపురం, పంజాగుట్ట, కూకట్పల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఖైరతాబాద్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మోకాలి లోతు వరకూ చేరిన వరద నీటితో రోడ్లు జలమయమయ్యాయి. పంజాగుట్ట నిమ్స్ వద్ద కారుపై చెట్టు విరిగిపడటం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు నిలిచిపోవడం, యూసఫ్గూడ, మలక్పేట, జవహర్నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ఉధృతి ఉద్రిక్తత కలిగించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వద్ద గంటల తరబడి వాహనాలు…
తెలంగాణలో డెంగీ కలకలం: కేసులు రోజురోజుకూ పెరుగుతోన్నా
తెలంగాణలో డెంగీ కేసులు అధికమవుతున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలు, మరియు హైదరాబాద్ పరిధిలో డెంగీ జ్వరాల తీవ్రత పెరుగుతోంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఇప్పటికే 160 కేసులు నమోదు అయ్యాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ ప్రధానంగా దోమ కాటు ద్వారా వ్యాపించే వైరల్ జ్వరం. అధిక జ్వరంతో పాటు, తలనొప్పి, దద్దుర్లు, నలత, రక్తస్రావం వంటి లక్షణాలు…
తెలంగాణలో మ్యూల్ అకౌంట్ ముఠాలపై పోలీసుల కఠిన చర్య
తెలంగాణలో మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. అక్రమ డబ్బుల లావాదేవీల కోసం ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడే ముఠాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలల్లో మొత్తం 228 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 93 మంది తెలంగాణ వాసులే ఉండడం ఆందోళన కలిగించే విషయం. జన్నారం (మంచిర్యాల) ప్రాంతంలో పట్టుబడ్డ ముఠాలో…
BRS నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు!
ఎమ్మెల్సీ కవిత పుట్టిన పార్టీపై బాంబు పేల్చినట్టే… నేతలే తనపై వ్యాఖ్యలు చేయించారని సంచలన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ లోపలుగా సంక్షోభం పెరుగుతోందా? ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా అలా అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశంపై మీడియాతో మాట్లాడిన ఆమె, తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి స్వయంగా పార్టీకి చెందిన పెద్ద నాయకులే ప్రోత్సహించారని తీవ్ర ఆరోపణ చేశారు. ఇదే కాకుండా తనపై చేసిన వ్యాఖ్యలకు పార్టీ నుంచి…
శివానీ ఆత్మహత్య లేఖ.. విద్యార్థుల బాధలకు అద్దం
హనుమకొండ జిల్లా నయీంనగర్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిట్టపల్లి శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. చదువు ఒత్తిడిని తట్టుకోలేక, తల్లిదండ్రుల అభిప్రాయాలను చెప్పలేక నలిగిపోయిన శివాని, చివరికి చావే దిక్కుగా భావించి ప్రాణాలు వదిలింది. ఆమె మరణానికి ముందు రాసిన లేఖ… ప్రతీ అక్షరం మానసికంగా కుంగిపోయిన పిల్లల మనస్థితిని అద్దం పడుతోంది. “మమ్మీ! ఆ చదువు నాకు అర్థం కావడం లేదు…..
- 1
- 2
