పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు: రక్తదాన శిబిరం ఏర్పాటు

సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో అమలాపురం ఎర్ర వంతెన దగ్గరలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని వృద్ధులకు దుప్పట్లు వికలాంగులకు ట్రై సైకిళ్లు ఇవ్వడం జరుగు తుందని జనసేన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల జనసేన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

డా. వినాయక్ రాథోడ్ డా. ప్రియాంక A1 TVతో ముఖాముఖి

ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ప్రముఖ వైద్యులు వినాయక్ రాథోడ్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్ గా కొనసాగుతూ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు వైద్యాన్ని అందిస్తూ మనోధైర్యాన్నిస్తూ వైద్యవృత్తికి న్యాయంచేస్తూ పేద..మధ్యతరగతి..అట్టడుగు వర్గాల ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న డాక్టర్ వినాయక్ రాథోడ్ తో పాటు డాక్టర్ రాథోడ్ ప్రియాంక తోA1tvసీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ వీక్షించండి

Read More

రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద దారుణ హత్య..

నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద రవి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.. కత్తులతో అతను పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున సమయంలో 2 నుంచి 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు బివి నగర్కు చెందిన రవిగా పోలీసులు చెప్తున్నారు

Read More

తిరుపతిలో వైద్యురాలిపై దారుణ దాడి

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ఓ రోగి వైద్యురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సహచర వైద్యులు వెంటనే స్పందించి అతడి బారి నుంచి ఆమెను కాపాడారు. శనివారం తాను…

Read More

మదనపల్లె రికార్డుల దహనం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సీఐడీకి అప్పగించింది. దస్త్రాల దహన ఘటనపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి 11 గంటల నుండి మంగళవారం వేకువజాము 3 గంటల వరకూ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు.  సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు,…

Read More

అనాథలా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి మదర్ థెరిసా

దయ, వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ థెరిసా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహోనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి… వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతామూర్తి మదర్ థెరిసా అని కీర్తించారు. ఎంతోమంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంతేకాకుండా… అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి…

Read More

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబు

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.  గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు.  ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. కృష్ణాష్టమి…

Read More