పుసులూరు గ్రామంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా
పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూలులో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాగులతో చేసిన పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జావ వంటి రాగులతో తయారైన పదార్థాలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఐరన్ శాతం పెరుగుతుందని టీచర్లు వివరించారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పు, కూరగాయలతో ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం నివారించవచ్చని తెలిపారు. బయట నుంచి తెచ్చుకున్న న్యూడిల్స్ వంటి పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హానికరమని, ఇంట్లో తయారుచేసిన పోషకవిలువలతో కూడిన ఆహారం…
