Saturday, February 21, 2026
spot_img
HomeTelanganaHyderabadప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహం...ఎక్కడంటే ?

ప్రపంచంలోనే అతి ఎత్తైన గాంధీ విగ్రహం…ఎక్కడంటే ?

Telangana News: హైదరాబాద్‌ మూసీ నదికి పునర్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్‌ వద్ద “ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని” ఏర్పాటు చేయనున్నారు. 2026 ఉగాది పండుగ రోజున ఈ భారీ పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విగ్రహంతో పాటు గాంధీజీ బోధనలు, సత్యాగ్రహ ఉద్యమాలను వివరించే అత్యాధునిక మ్యూజియం, ధ్యాన మందిరాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాకుండా గాంధేయవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.

ALSO READ:Ibomma Ravi Case | ‘పోటీలేని వ్యాపారమని పైరసీ’ చేశా..విచారణలో సంచలన విషయాలు


మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశలో 9 కిలోమీటర్ల మేర నది అభివృద్ధి చేయనున్నారు. నదీ తీరాల వెంట వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని ఉద్యానవనాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తారు. కొరియా, జపాన్ దేశాల్లో అమలవుతున్న నది శుద్ధి నమూనాలను ఇక్కడ అమలు చేయనున్నారు.

ఈ తొలి దశ పనుల కోసం సుమారు “₹4,100 కోట్ల వ్యయంతో ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం అందించేందుకు ముందుకొచ్చింది”. ప్రాజెక్టులో భాగంగా ప్రభావితులైన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రారంభించిన రెండేళ్లలోనే తొలి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

YouTube thumbnailYouTube icon

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular