Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeInterNationalజైషే మహమ్మద్ కొత్త కుట్ర… విద్యావంతులైన ముస్లిం మహిళలను ఉగ్రవాదం వైపు తిప్పే ప్రయత్నం!

జైషే మహమ్మద్ కొత్త కుట్ర… విద్యావంతులైన ముస్లిం మహిళలను ఉగ్రవాదం వైపు తిప్పే ప్రయత్నం!

-

Chat on WhatsApp

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తాజాగా తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు భారత నిఘా సంస్థలు బయటపెట్టాయి. ఇప్పటివరకు యువకులను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు చదువుకున్న, సామాజికంగా చైతన్యవంతమైన ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తోంది. మతపరమైన ప్రసంగాలు, భావోద్వేగపూరిత సందేశాలు, ఆన్‌లైన్ చాట్ గ్రూపులు ద్వారా బ్రెయిన్‌వాష్ చేస్తూ వారిని తన నెట్‌వర్క్‌లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఈ రహస్య కార్యకలాపాల వెనుక “జమాతుల్-ముమినాత్” అనే ఉప సంస్థ ఉందని సమాచారం. ఈ సంస్థ 2004 నుంచే ఉనికిలో ఉన్నప్పటికీ, ఇటీవల పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర శిక్షణ శిబిరాలు బలహీనపడడంతో మహిళా నియామకాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా మతపరమైన స్ఫూర్తి పేరుతో ప్రచారం నిర్వహిస్తోంది.

ఉర్దూలో ముద్రించిన లిఫ్లెట్లు, మక్కా–మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలు వాడి, “అల్లాహ్ మార్గం కోసం త్యాగం చేయండి”, “ఇస్లాం గౌరవం కాపాడండి” వంటి నినాదాలతో మహిళలను భావోద్వేగాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొంతమంది మహిళలు నిధుల సేకరణ, ఆన్‌లైన్ ప్రోపగాండా వంటి కార్యకలాపాల్లో కూడా పాల్గొంటున్నట్లు గుర్తించారు.

భారత సైన్యం ఇటీవల చేసిన “ఆపరేషన్ సిందూర్” దాడుల తర్వాత జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు తమ ప్రధాన స్థావరాలను పాక్–ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాలకు తరలించుకున్నాయి. నిఘా వర్గాల అంచనా ప్రకారం, ఈ కొత్త వ్యూహం వెనుక ప్రధాన ఉద్దేశ్యం — సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న మహిళలను వాడుకుని సైబర్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను బలపరచడం.

భారత సైనిక వర్గాలు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. “ఉగ్రవాదం పేరుతో మతాన్ని దుర్వినియోగం చేయడం అసహ్యం. ఇలాంటి సంస్థలు ఎన్ని రూపాలు మార్చుకున్నా, భారత సైన్యం వాటిని పూర్తిగా నిర్మూలిస్తుంది” అని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తే, ఆ దేశం ప్రపంచ పటం నుంచే అదృశ్యమవుతుందన్న హెచ్చరికలు కూడా వెలువడ్డాయి.

ఇక, నిఘా వర్గాలు దేశ ప్రజలకు అప్రమత్తత సూచిస్తున్నాయి — ఆన్‌లైన్‌లో మతపరమైన పేరుతో అనుమానాస్పద ప్రచారం గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సైబర్ ఉగ్రవాదం రూపంలో వెలువడుతున్న కొత్త ముప్పు దేశ భద్రతకు పెద్ద సవాలుగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp