Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeNationalఐసీఐసీఐ బ్యాంకులో చెక్కులపై కొత్త విధానం: ఇకపై ఒక్క రోజులోనే క్లియరెన్స్, పాజిటివ్ పే తప్పనిసరి!

ఐసీఐసీఐ బ్యాంకులో చెక్కులపై కొత్త విధానం: ఇకపై ఒక్క రోజులోనే క్లియరెన్స్, పాజిటివ్ పే తప్పనిసరి!

-

Chat on WhatsApp

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి ఎదురు చూసే అవసరం ఉండదు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంక్ వినూత్న మార్పులు తీసుకొచ్చి, ఒక్కరోజులోనే చెక్కులను క్లియర్ చేసే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఖాతాదారుల సౌకర్యం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు చెక్కులు బ్యాచ్ ఆధారంగా సమర్పించబడేవి. ఉదయం సమర్పిస్తే మరుసటి రోజు మాత్రమే ఖాతాలో నగదు జమయ్యేది. ఇప్పుడు ఆ విధానం పూర్తిగా మారబోతోంది. సమర్పించిన కొన్ని గంటల్లోనే చెక్కును క్లియర్ చేయడానికి బ్యాంక్ నిరంతర చెక్కు క్లియరెన్స్ వ్యవస్థను ప్రారంభిస్తోంది. దీంతో ట్రాన్సాక్షన్ల వేగం గణనీయంగా పెరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

పాజిటివ్ పే తప్పనిసరి

చెక్కుల భద్రతను మరింత బలోపేతం చేయడానికై, అధిక విలువల లావాదేవీల కోసం పాజిటివ్ పే విధానాన్ని తప్పనిసరి చేశారు. రూ. 50,000 కన్నా ఎక్కువ విలువ గల చెక్కులకు వినియోగదారులు చెక్కు వివరాలను (చెక్కు సంఖ్య, తేదీ, లబ్ధిదారుడు పేరు, మొత్తం, మొదలైనవి) ముందుగానే ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేయాలి.

అయితే రూ. 5 లక్షలు మించి ఉన్న చెక్కులకు పాజిటివ్ పే ఫీచర్ తప్పనిసరి అయింది. దీనిని ఉపయోగించకుండా చెక్కును సమర్పిస్తే, బ్యాంక్ దానిని తిరస్కరించే అవకాశం ఉంది. పైగా, పాజిటివ్ పే ద్వారా ధృవీకరించని చెక్కుల విషయంలో ఆర్‌బీఐ వివాద పరిష్కార విధానం వర్తించదు. దీంతో ఖాతాదారులందరూ అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ సూచించింది.

రెండు దశల్లో మార్పులు

ఈ కొత్త విధానం రెండు దశల్లో అమలవుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.

  • మొదటి దశ: అక్టోబర్ 4, 2025 నుంచి ప్రారంభం అవుతుంది.
  • రెండో దశ: జనవరి 3, 2026 నుంచి పూర్తిగా అమలులోకి వస్తుంది.

ఖాతాదారుల కోసం ముఖ్య సూచనలు:

చెక్కు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ఖాతాదారులు ఈ సూచనలను పాటించాలి:

  1. చెక్కుపై అక్షరాలు మరియు అంకెలు స్పష్టంగా, తప్పులులేకుండా రాయాలి.
  2. తేదీ చెల్లుబాటులో ఉండాలి.
  3. లబ్ధిదారుడి పేరు లేదా మొత్తంలో ఏ విధమైన కొట్టివేతలు, మార్పులు ఉండకూడదు.
  4. సంతకం బ్యాంక్ వద్ద ఉన్న రికార్డులతో సరిపోవాలి.

ఈ మార్పుల ద్వారా, చెక్కుల ద్వారా జరిగే లావాదేవీల్లో పారదర్శకత, భద్రత మరియు వేగం పెరుగుతుందని బ్యాంక్ ఆశిస్తోంది. ఫార్వర్డ్ లుకింగ్ టెక్నాలజీ ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం, బ్యాంకింగ్ రంగంలో మరొక ముందడుగు అన్నదానిలో సందేహం లేదు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp