Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ – తీవ్ర వాయుగుండం ప్రభావంతో వరద భయం

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ – తీవ్ర వాయుగుండం ప్రభావంతో వరద భయం

-

Chat on WhatsApp

తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటడంతో ఉత్తరాంధ్రలో భయం మళ్లీ పెరిగింది. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 75 కి.మీ వరకు ఈదురుగాలులు వీసే అవకాశముండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, వాయుగుండం తీరం దాటి ప్రస్తుతం వాయవ్య దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ, దీని ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది. గాలుల వేగం గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉన్నందున, రహదారి ప్రయాణాలు, బోటింగ్, చేపల వేట వాయిదా వేసుకోవాలని సూచించింది.

ఒడిశాలో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావం వల్ల, శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నదులు ఉప్పొంగిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవహించడంతో పరిస్థితి దిగజారుతోంది. ముఖ్యంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ వంటి నదుల్లో నీటి మట్టాలు అత్యధికంగా పెరిగాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, వంశధార నదిపై ఉన్న హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద నీటిని అదుపులో ఉంచేందుకు బ్యారేజీ గేట్లను ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా నాగావళి నదిపై నారాయణపురం ఆనకట్ట వద్ద కూడా నీటి ప్రవాహం తీవ్రంగా పెరిగిందని, మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని తక్కువ ప్రదేశాల వద్ద వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో, కొన్నిచోట్ల రహదారి సంబంధాలు కూడా తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడంలో జంకుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో అధికారులు అపరాయిణ నిఘా పెట్టారు. అన్ని రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖలు ఒకటై సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. బాధిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, వాయుగుండం బలహీనపడిన తర్వాత కూడా వర్షాల ప్రభావం రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అవాంఛిత ప్రయాణాలు చేయకుండా, ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలను పాటించాలని సూచించబడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp