నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి బాలుడు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన నేతళ్ల కిరణ్, స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ కొండమల్లేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వస్తున్న కిరణ్, శనివారం ఉదయం ఫోన్ రావడంతో డాబాపైకి వెళ్లి మాట్లాడుతున్నాడు.
అతని పొరపాటున డాబా పక్కన ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. వెంటనే విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు గుండె బద్దలు కొట్టిన ఈ ఘటనను పోలీసులకు తెలిపారు. కిరణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
