Vikarabad:వికారాబాద్లో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం – డ్రైవర్కు తీవ్ర గాయాలు
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాదం మరువక ముందే, అదే మార్గంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కరణ్కోట మండల సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్ను…
