సముద్ర తీరంలో మళ్లీ సందడి – తెరుచుకున్న సూర్యలంక బీచ్ గేట్లు
ఎట్టకేలకు బాపట్ల సూర్యలంక బీచ్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తాళాలు తీసివేయడంతో పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంథా తుఫాను ప్రభావంతో బీచ్లో గుంతలు ఏర్పడటంతో భద్రతా కారణాల రీత్యా కొంతకాలం పాటు బీచ్కు ప్రవేశం నిషేధించారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణమయ్యాయని నిర్ధారించుకున్న అధికారులు పర్యాటకులను బీచ్కు అనుమతించారు. కార్తీక మాసం సందర్భంగా…
