
ఒక్కరోజులోనే 200 మావోయిస్టులు లొంగుబాటు – బస్తర్లో చారిత్రాత్మక పరిణామం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి చారిత్రాత్మక ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న సీనియర్ నాయకులు సహా సుమారు 200 మంది మావోయిస్టులు, తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమయ్యారు. ఈ లొంగుబాటు కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సమక్షంలో శుక్రవారం (అక్టోబర్ 18, 2025) నిర్వహించబడుతుంది. ఇది మావోయిస్టు ఉద్యమంలో ఒక తిరుగుబాటు ఘట్టంగా అభివర్ణించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 258 మంది మావోయిస్టులు లొంగిపోవడం,…