ఉక్రెయిన్ వివాదం ముగింపునకు కృషి చేసే ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని అమెరికా ప్రకటించింది. మోదీ-జెలెన్‌స్కీ భేటీపై స్పందన.

ఉక్రెయిన్ వివాదంపై అమెరికా స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార…

Read More
కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో తల్లిదండ్రులు పోలీసులు కేసును నీరుగార్చాలని డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోల్‌కతా డాక్టర్ హత్యపై తల్లిదండ్రుల ఆగ్రహం

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన డాక్టర్ కేసులో ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మర్డర్ కేసులో పోలీసులు మొదటి నుంచీ తమకు వ్యతిరేకంగానే ఉన్నారని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం…

Read More
సుప్రీంకోర్టు, వివాదాస్పద అధికారికి పదవి కట్టబెట్టాలని చూసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉత్తరాఖండ్ సీఎం ధామిపై సుప్రీం ఆగ్రహం

వివాదాస్పద అధికారికి ఉన్నత పదవి కట్టబెట్టే ప్రయత్నం చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోవద్దని, సీఎం అంటే రాజు కాదని హితవు చెప్పింది. ఈమేరకు బుధవారం ఓ పిటిషన్ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఐఏఎఫ్ ఆఫీసర్ ఒకరికి రాజాజీ…

Read More
పాకిస్థాన్‌పై సిరీస్ నెగ్గి బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరింది. భారత్, ఆస్ట్రేలియాకు సవాల్‌ విసిరేందుకు సిద్దం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కి దూసుకొచ్చిన బంగ్లాదేశ్

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నెగ్గి చరిత్ర సృష్టించిన ‘డార్క్ హార్స్’ బంగ్లాదేశ్ అనూహ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లోకి దూసుకొచ్చి ఇండియా, ఆస్ట్రేలియాకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఫైనల్స్‌లో చోటు కోసం పోరాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పత్తాలేకుండా పోయిన ఈ జాబితాలోకి ఇప్పుడు అనూహ్యంగా బంగ్లాదేశ్ దూసుకొచ్చి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్…

Read More
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు బెయిల్ నిరాకరణ, కేసు కొనసాగింపు.

టీడీపీ కార్యాలయ దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురయింది. వైసీపీ  నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేశ్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కూటమి అధికారంలోకి…

Read More
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నసీఫ్ యూసఫ్ దర్శకత్వం వహించిన మలయాళ థ్రిల్లర్ 'ఇరుల్,' సెప్టెంబర్ 6న ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్.

తమిళంలో ‘ఇరుల్’ మిస్టరీ థ్రిల్లర్

మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’.  మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన…

Read More
జియో రూ.1,889 ప్లాన్‌: 336 రోజుల అపరిమిత కాల్స్, 24GB డేటాతో రూ.173/నెల చొప్పున అద్భుత ప్రయోజనాలు.

జియో కొత్త ప్లాన్లతో కస్టమర్ల ఆకర్షణ

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ వంటి టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్…

Read More