నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో సురేష్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో రాజిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని అధికారులతో పాటు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వినియ్, గ్రామ కార్యదర్శి నర్సింలు…
