లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ.రైతు బీమా మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఈ ఘటన గురువారం మరిపెడ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14న మృతి చెందగా, ఆయన కుమారుడు రైతు బీమా నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపెళ్లి సందీప్ బీమా పత్రాలు ఆన్లైన్లో పంపించాలంటే…
