విద్యార్థినులతో కాళ్లు నొక్కించిన లేడీ టీచర్ – ప్రభుత్వం సస్పెన్షన్ వేటు
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్ వారినే కాళ్లు పట్టించుకోవడం సామాజిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి,సదరు ఉపాధ్యాయురాలు సుజాతను తక్షణం సస్పెండ్ చేసింది.సుజాత ఆ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్గా (హెచ్ఎం) పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరల్ వీడియోలో ఆమె కుర్చీలో కూర్చుని మొబైల్…
