పటాన్చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్రావు పిలుపు
పటాన్చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్రావు మాట్లాడుతూ, “కేసీఆర్ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…
