చలుమూరి వెంకట్రావు తల్లి మృతిపై బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పరామర్శ
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని గుర్ల తమ్మి రాజుపేట గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు తల్లి మృతి చెందింది. ఈ శోకసమయంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, తెంటు లక్ష్మనాయుడు చలుమూరి వెంకట్రావును పరామర్శించారు. వెంకట్రావు తల్లి కాలం చేయడంతో, ఎమ్మెల్యే బేబీ నాయన మెంటాడ మండలంలోని జీటీపేట చేరుకుని, వెంకట్రావుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా, ఎమ్మెల్యే బేబీ నాయనతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు…
