
నవంబర్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నామినేషన్ నిబంధనలు అమల్లోకి
బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. బ్యాంకు డిపాజిట్లు, సేఫ్టీ లాకర్ల నామినేషన్ ప్రక్రియలో గణనీయమైన మార్పులు తీసుకువస్తూ, కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులు నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు ఇకపై ఒక్కరిని మాత్రమే కాకుండా గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఇది డిపాజిట్లకు సంబంధించిన సౌకర్యం. ఈ నామినీలకు ఒకేసారి (jointly) లేదా ఒకరి తర్వాత ఒకరు (sequentially) అనే విధంగా…