ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై చర్చలు సఫలం – కళాశాలల బంద్ విరమణ
హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యపై ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్లో నాలుగు గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం ఒప్పందం కుదిరింది. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించింది. చర్చలలో ప్రభుత్వం రూ.1,500 కోట్లు వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.600 కోట్లు విడుదల చేసినట్లు, మరో రూ.600…
