వైఎస్ఆర్ కడపలో రైతు భూమి 6 అడుగుల లోతు కుంగిపోయింది. 2019లో ఇదే విషయం జరిగింది. వ్యవసాయ అధికారులు పరిశీలించాలని రైతు కోరుతున్నారు.

ఏపీలో రైతు భూమి కుంగిపోవడం… మిస్టరీగా మారిన ఘటన…

ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న‌ట్టుండి భూమి కుంగిపోవ‌డం మిస్ట‌రీగా మారింది. జిల్లా ప‌రిధిలోని దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో రైతు మానుకొండు శివ‌కి చెందిన వ్య‌వ‌సాయ భూమిలో బుధవారం నాడు సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది.  పైనుంచి చూస్తుంటే అచ్చం పెద్ద బావిలా క‌నిపిస్తోంద‌ని రైతు వాపోతున్నారు. అస‌లేమైందో కూడా తెలియ‌డం లేద‌ని, ఉన్న‌ట్టుండి వ్య‌వ‌సాయ భూమి ఇలా భారీ గుంత‌లుగా మార‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని తెలిపారు.  2019లోనూ ఇలాగే జ‌రిగింద‌ని శివ చెప్పారు….

Read More
ప‌వ‌న్ క‌ల్యాణ్, సీఎం చంద్ర‌బాబుపై డ్రోన్ల సాయంతో వరద బాధితులకు ఆహారం అందించినందుకు ప్రశంసలు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ డ్రోన్ల సాయంపై సీఎం చంద్ర‌బాబుకు స‌న్నాహాలు

భారీ వ‌ర‌ద‌లు తెలుగు రాష్ట్రాల‌ను వ‌ణికించిన విష‌యం తెలిసిందే. దీంతో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వాలు స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. ముఖ్యంగా ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్యల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌డం, నేరుగా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకోవ‌డం ప్రత్యేకంగా నిలిచింది. బాధితులు ప‌స్తులు ఉండ‌కుండా డ్రోన్ల‌ను ఉప‌యోగించి ఆహారాన్ని అందించారు.  ఇలా డ్రోన్ స‌హాయంతో వ‌ర‌ద బాధితుల‌కు ఆహారాన్ని అందించిన ఫొటోల‌ను డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

Read More

భారీ వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటన

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు ఆయన నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయవాడ, ఏపీలోని ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలు, రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడలో అధికారులతో సమావేశమవుతారు. నష్టం అంచనాపై అధికారులతో చర్చిస్తారు. రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం…

Read More
ఏపీలో పింఛన్ల పంపిణీకి 1.34లక్షల కొత్త ఫింగర్‌ప్రింట్ స్కానర్ల కొనుగోలు. సెక్యూరిటీ సవాల్లకు పరిష్కారం.

ఏపీలో పింఛన్ల పంపిణీలో కొత్త ఫింగర్‌ప్రింట్ స్కాన‌ర్లు

పింఛ‌న్ల పంపిణీలో కీల‌క మార్పు దిశ‌గా ఏపీలోని కూట‌మి స‌ర్కార్ అడుగులేస్తోంది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా సామాజిక పింఛ‌న్ల పంపిణీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌కలకు ఆస్కారం లేకుండా స‌రికొత్త ప‌ద్ద‌తితో ముందుకు వ‌స్తోంది.  దీనిలో భాగంగా ప్ర‌భుత్వం అత్యాధునిక ఎల్ ఆర్‌డీ (రిజిస్ట‌ర్డ్‌) ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ల‌ను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం రూ. 53కోట్ల‌ను గ్రామ‌, వార్డు స‌చివాల‌య శాఖకు కేటాయించింది. దీంతో ఏపీ స‌ర్వీసెస్ టెక్నాల‌జీ ద్వారా డివైజ్‌ల…

Read More
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు బెయిల్ నిరాకరణ, కేసు కొనసాగింపు.

టీడీపీ కార్యాలయ దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు నిరాశ ఎదురయింది. వైసీపీ  నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేశ్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కూటమి అధికారంలోకి…

Read More
బుడమేరులో 90% ఆక్రమణ విజయవాడకు శాపమైందని, సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

బుడమేరులో జరిగిన ఆక్రమణల గురించి పవన్ కల్యాణ్ విమర్శలు

బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఈ వయస్సులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పని చేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు…

Read More
హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.

హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించిన విప్లవ్ సిన్హా అరెస్ట్

‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే కూల్చేయిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తనని, సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్ పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి, హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు…

Read More