చీమల భయంతో వివాహిత ఆత్మ*హత్య – రామచంద్రాపురం అమీన్పూర్లో విషాదం
రామచంద్రాపురం అమీన్పూర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీమల భయంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివసిస్తున్న మనీషా (25) చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 2022లో మనీషా, చిందం శ్రీకాంత్ (35)ను వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల పాప అనికా ఉంది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు ఉద్యోగ కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా అమీన్పూర్లో నివసిస్తున్నారు. ALSO…
