అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో 'సింబా' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. హత్యలు, విచారణ నేపథ్యంలో సీరియస్ కథతో, సక్సెస్‌ఫుల్ మిస్టరీ నెరవేర్చింది.

‘సింబా’ సినిమాను ‘ఆహా’లో స్ట్రీమింగ్

జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘సింబా’ సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. స్క్రీన్ ప్లే – మాటలు అందించింది దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత కూడా. ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు చూద్దాం.  అక్ష (అనసూయ) హైదరాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్…

Read More
ఏఐసీసీ ప్రకటన మేరకు మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన నియామకం జరిగింది.

మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీకాలం గత జులై 7వ తేదీతో ముగిసింది. దీంతో ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు. అధిష్ఠానం మహేశ్…

Read More
బుడమేరు గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. ఇనుపరాడ్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

బుడమేరు గండి పూడ్చే పనుల్లో ఆర్మీ సాయం

విజయవాడ వరదలకు ప్రధాన కారణంగా నిలిచిన బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడిన సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రింబవళ్లు తేడా లేకుండా బుడమేరు కట్టపై మకాం వేసి, గండ్లు పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్నారు.  జోరున వాన కురుస్తున్నా ఆయన కట్ట మీద నుంచి పక్కకి రాకుండా, సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. నిమ్మల బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి భోజనాలన్నీ బుడమేరు కట్టపైనే చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మల ఆధ్వర్యంలో రెండు గండ్లు విజయవంతంగా పూడ్చారు.  ఇక,…

Read More
సెన్సెక్స్ 1017 పాయింట్లు, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోగా, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది.

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం, రూ.5.3 లక్షల కోట్లు నష్టం

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఈ ఒక్కరోజే రూ.5.3 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1017 పాయింట్లు క్షీణించి 81,183 వద్ద, నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్ రేటు తగ్గింపు అంచనాలు, యూఎస్ ఉద్యోగ నివేదికకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ పతనం కారణంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.3…

Read More
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో వరద నష్ట అంచనా, సహాయక చర్యలకు కేంద్రం నిపుణుల బృందాలు పంపి, 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు సిద్ధం.

తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం నుండి పూర్తి సహకారం

ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించినట్లు తెలిపింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది….

Read More
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ నిర్ధారించింది, దర్యాప్తు తుది దశలో.

కోల్‌కతా హత్యాచారం కేసులో ఒక్కరే నిందితుడు అని నిర్ధారించిన సీబీఐ

గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. లభ్యమైన సాక్ష్యాధారాలన్నీ సంజయ్ రాయ్‌ ఒక్కడే నిందితుడని సూచిస్తున్నాయంటూ సీబీఐ వర్గాలు చెప్పాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం పేర్కొంది. విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే ఛార్జిషీట్లు కూడా దాఖలు…

Read More
తప్పుడు కేసు వేధింపులపై ఏపీ పోలీసులకు నటి కాదంబరి ఫిర్యాదు. విద్యాసాగర్ కుట్రలో భాగమని, కుటుంబానికి రక్షణ కోరుతూ మీడియా వాఖ్యలు.

ఏపీ పోలీసులపై నటి కాదంబరి ఫిర్యాదు… తప్పుడు కేసుల ఆరోపణ..

ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో నాటి విజయవాడ సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నది. గురువారం రాత్రి విజయవాడ సీపీ కార్యాలయానికి చేరుకున్న నటి కాదంబరి .. దర్యాప్తు అధికారి ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు అందజేసింది. వైసీపీ నేత కుక్కల…

Read More