మహిళల చైతన్యంతోనే ప్రాంత అభివృద్ధి – ఎమ్మెల్యే విజయ్ చంద్ర
మహిళలు చైతన్యవంతులైతే ఆ ప్రాంతం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పెద్దబండపల్లి లో జరిగిన సక్షం అంగన్వాడి కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు రేపటి భావి పౌరులని చెప్పారు. పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా ఎదగాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో కోడిగుడ్లు, పాలు పాడైనవి అందించేవారని, ప్రస్తుతం సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు….
