మొంథా తుపాను ఉధృతి – 110 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో పోర్టులకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉధృతంగా మారుతోంది. ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సముద్రం తీవ్ర ఆందోళనలో ఉంది. భారీ అలలు తీరప్రాంతాలను ఢీకొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది….

Read More

సీఎం చంద్రబాబు ‘మొంథా’ తుపానుపై సమీక్ష – పునరావాస కేంద్రాల్లో తక్షణ సాయం ఆదేశం

‘మొంథా’ తుపాను రాష్ట్రం వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ప్రజల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తుపాను ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందే ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 అందించాలని ఆయన ఆదేశించారు….

Read More