క్రాంతినగర్లో 12 అడుగుల కొండచిలువ కలకలం – యువకుల ధైర్యంతో సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు
విశాఖపట్నం నగరంలోని ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పాములు, అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి రావడం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 అడుగుల పొడవు గల ఈ కొండచిలువ ఓ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ కాలువలో కనిపించింది. స్థానికులు ఆ కొండచిలువను గమనించి ఒక్కసారిగా భయంతో అల్లకల్లోలానికి గురయ్యారు. అయితే కొంతమంది ధైర్యవంతులైన యువకులు…
