కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి వద్ద శనివారం అర్థరాత్రి ఓ ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి నుండి కామారెడ్డి వైపు వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొనింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.
ప్రమాద సమయంలో కారు నడిపిన శివతేజ విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అతను తన పని ముగించుకొని తిరిగి వస్తుండగా దేవీ విహార్ ప్రాంతానికి సమీపంలో కారు వేగంగా వచ్చి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో కారును నడిపిస్తున్న డ్రైవర్కు గాయాలు కావడంతో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
