జైలు అనుభవం గురించి జానీ మాస్టర్ భావోద్వేగం

Johnny Master shares his emotional journey post-jail, thanking family and supporters for standing by him, in an interview with 'Jafar.' Johnny Master shares his emotional journey post-jail, thanking family and supporters for standing by him, in an interview with 'Jafar.'

టాలీవుడ్ లో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన జానీ మాస్టర్, ఇటీవల కొన్ని కారణాలతో జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన గురించి సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో పెద్ద చర్చ జరిగింది. జైలు నుండి బెయిల్ పై విడుదలైన ఆయన, తాజాగా ‘జాఫర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.

“జైలుకి వెళ్లినప్పుడు నా జీవితంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సాయంత్రం అయ్యాక నా కుటుంబం గుర్తుకొచ్చేది. మా అమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడం గురించి ఆందోళన చెందేదాన్ని. నా బాధను బయట చూపించకుండా వాష్ రూమ్ కి వెళ్లి ఏడ్చేవాడిని,” అంటూ భావోద్వేగంగా చెప్పారు.

జైలులో గడిపిన అనుభవాల గురించి మాట్లాడుతూ, “జీవితంలో ఎవరూ జైలు ముఖం చూడకూడదు. అది ఎంత పెద్ద శత్రువైనా సరే, నేను కోరుకునేది అదే. ఆ సమయంలో నా భార్య సుమలత నాకు పెద్ద మద్దతుగా నిలిచారు,” అని తెలిపారు.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై వస్తున్న వార్తల గురించి ఆయన వివరిస్తూ, “వాళ్లకి నాపై నమ్మకం ఉంది కాబట్టే మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనమే గొప్పగా మాట్లాడుతుంది. నాగబాబు గారు, నా అభిమానులు నాకు మద్దతుగా నిలిచినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను,” అని జానీ మాస్టర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *