ఐపీఎల్ 2025 రికార్డులతో దుమ్ములేపిన జట్లు

Record-Breaking Moments That Lit Up IPL 2025 Record-Breaking Moments That Lit Up IPL 2025

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠ, ఉత్సాహం, ఉగ్రరూపాలు. ప్రతీ సీజన్‌లోనూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. ఐపీఎల్ 2025 కూడా ఈ పంథాలోనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో కొన్ని జట్లు అరుదైన విజయాలు సాధించి, చరిత్ర సృష్టించాయి. ప్లే ఆఫ్స్‌ దశకు చేరుతున్న వేళ, కొన్ని జట్లు సీజన్‌ను అద్భుతంగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో ప్రతిబంధకాలపై గెలిచింది. ప్రత్యర్థి మైదానాల్లో వరుసగా ఆరు విజయాలతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా ముంబై ఇండియన్స్ ఐదోసారి వరుసగా ఐదు విజయాలు సాధించడం గమనార్హం. గతంలో ఇలా గెలిచిన నాలుగు సార్లు ముంబై టైటిల్‌ను దక్కించుకుంది. ఇది మళ్లీ ముంబైపై అంచనాలు పెంచింది.

ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వరుస విజయాలతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన 7 మ్యాచ్‌లలో 6 గెలిచిన గుజరాత్ మరోసారి తన బలాన్ని చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నాలుగు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. సూపర్ ఓవర్లలో ఐదు మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలు కూడా ఢిల్లీ ఖాతాలో పడ్డాయి.

పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ టార్గెట్ (112) కాపాడిన జట్టుగా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు సాధించింది. పంజాబ్‌పై 21, బెంగళూరు, సన్‌రైజర్స్‌పై 20 చొప్పున గెలిచింది. అత్యధిక స్కోర్ (287) నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ధోనీ మాత్రం అతిపెద్ద వయస్సులో “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు గెలిచిన క్రికెటర్‌గా మరోసారి మెరిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *