శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సిఐటియూ ఆఫీస్ నుంచి ర్యాలీగా కాలేజ్ సర్కిల్ మీదుగా వస్తూ, కళా జ్యోతి సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన తెలిపారు.
నిరసనలో మోకాళ్లపై నిలుస్తూ, పచ్చి గడ్డి తినడం ద్వారా వినూత్నమైన ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా, జెవి రమణ సిఐటియు మండల కన్వీనర్, టీ.అయూబ్ ఖాన్ మాట్లాడారు.
2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పారిశుధ్య పనుల కోసం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, మహిళలను నియమించారని చెప్పారు.
అయితే, కార్మికులు నెలకు కేవలం 6000 రూపాయలు మాత్రమే పొందుతున్నారని, వారి కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాయని వారు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికురాలికి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వీరు ప్రభుత్వానికి ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఆరు నెలల వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

 
				 
				
			 
				
			 
				
			