కామారెడ్డి జిల్లా శ్రీ శారద శరన్నవ రాత్రో ఉత్సవాలు

The Sri Sharada Sharannavaratri celebrations commenced in Kamareddy, featuring various rituals and community involvement over nine days. The Sri Sharada Sharannavaratri celebrations commenced in Kamareddy, featuring various rituals and community involvement over nine days.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ , ఆలయ అర్చకులు సతీష్ పాండే , అజయ్ పాండే , రమేష్ జ్యోషి , నాగరాజ్ శర్మ , పాండురంగ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శారద శరన్నవ రాత్రో ఉత్సవాలు మొదటిరోజు ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవ , గణపతి పూజ , పుణ్యవచనం , ప్రధాన కలశ స్థాపన , అమ్మవారికి పల , పంచామృత అభిషేకం , దివ్య అలంకరణ , మహాగణపతి మూల మంత్ర హోమం , దంపతులచే యజ్ఞహోమం , అర్చనలు అభిషేకాలు మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారంతో భక్తులందరినీ ఆకర్షించుకుంది. గణపతి మూల మంత్ర హోమం , సాయంత్రం సుహాసినులచే కుంకుమార్చన తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు నిత్యర్చన అభిషేకాలు , దంపతులచే యజ్ఞ హోమాలు జరుగుతున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి , కోశాధికారి సాయి రెడ్డి , ఉపాధ్యక్షులు పెంటయ్య , సభ్యులు రాజ్ గంబీర్ రావు , లింగం , సందీప్ రమేష్, శ్రీనివాస్ , శ్రీ శారద మాత మహిళా కమిటీ బృందం సభ్యులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *