‘కన్నప్ప’లో ప్రభాస్, మోహన్‌లాల్ పారితోషికం ఎంత?

Manchu Vishnu revealed that Prabhas & Mohanlal did not charge any fee for 'Kannappa,' joining the project out of admiration for Mohan Babu. Manchu Vishnu revealed that Prabhas & Mohanlal did not charge any fee for 'Kannappa,' joining the project out of admiration for Mohan Babu.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా, ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రూ. 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తోంది.

ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ముఖ్య అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో ప్రభాస్ రుద్రుడిగా దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, మోహన్‌లాల్ తీసుకున్న పారితోషికంపై ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్, మోహన్‌లాల్ ఇద్దరూ ఈ చిత్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. వారి తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతోనే వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని తెలిపారు.

ఈ వార్తను తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో వారి గొప్ప మనసును ప్రశంసిస్తున్నారు. తమ అభిమాన నటులు పారితోషికం తీసుకోకుండానే ఇలా ఓ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని తెలియడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘కన్నప్ప’పై అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *