20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ పై గొడవ, 10 మందికి గాయాలు

A fight between two families over an expired ₹20 Kurkure packet in Karnataka's Davanagere district led to 10 people being severely injured. A fight between two families over an expired ₹20 Kurkure packet in Karnataka's Davanagere district led to 10 people being severely injured.

20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ ఒక కుటుంబాల మధ్య గొడవ పెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అతీఫుల్లా అనే వ్యక్తి తన కిరాణా షాపులో సద్దాం అనే వ్యక్తి పిల్లలకు కుర్ కురే ప్యాకెట్ అమ్మాడు.

ఆ ప్యాకెట్ ఎక్స్ పైరీ అయినది అని సద్దాం కుటుంబం ఆరోపించడంతో, ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒక్కసారిగా రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అతీఫుల్లా కుటుంబం తర్వాత సద్దాం హోటల్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ సంఘటనలో పలువురు పరారీలో ఉన్నారు. ఎలాంటి పరిష్కారం లేకుండా రెండు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

అరెస్ట్ భయంతో సుమారు 25 మంది పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ కోసం ఇలా పెద్ద గొడవ జరగడం విచారకరమని వారు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *