హైదరాబాద్ నగరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,సింగిరెడ్డి మీన్రెడ్డి అనే ఆటో డ్రైవర్ మంగళవారం సాయంత్రం **డ్రంక్ అండ్ డ్రైవ్** తనిఖీలో పట్టుబడ్డాడు.
పరీక్షలో రీడింగ్ 120గా రావడంతో, పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మీన్రెడ్డి అర్ధరాత్రి కుషాయిగూడ ట్రాఫిక్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు గమనించిన పోలీసులు వెంటనే ఆర్పడానికి ప్రయత్నించినా,తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మృతిచెందాడు.
మృతుడు దమ్మాయిగూడ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.మీన్రెడ్డి కుటుంబ సభ్యులు,పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం నగరాన్ని కుదిపేసింది.
