జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.
ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం మరియు రిఫరల్ కేసుల సమర్థతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ఆసుపత్రుల పనితీరులో మెరుగులు దిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, జిల్లాలో సత్వర చికిత్స సేవలను మరింతగా పెంపొందించనున్నామని వి.కరుణ స్పష్టం చేశారు.
