Bird flu scare in Cherukupalli, Nalgonda. 7,000 chickens died in a poultry farm, causing heavy losses to the owner.

నల్గొండ చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. గ్రామ శివారులో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్‌లో భారీగా కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది. మొత్తం 13,000 కోళ్లు ఉండగా, ఒక్కసారిగా 7,000 కోళ్లు మరణించడంతో యజమాని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో తక్షణమే మృతి చెందిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు యజమాని తెలిపారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు….

Read More
Komaram Vandana urged support for the Pardhan community, emphasizing the need for recognition at a public meeting in Adilabad.

పర్ధన్ కులస్తుల గుర్తింపుకు అదిలాబాద్‌లో భారీ సభ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పర్ధన్ జెంజాతి ఉత్తన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరం వందన, పర్ధన్ కులస్థులకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు అదిలాబాద్‌లోని రాంలీల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పర్ధన్ కులస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తమ కులానికి గుర్తింపు లేదని, ఇతర సామాజిక వర్గాలతో…

Read More
Ministers Tummala Nageswara Rao and Jupally Krishna Rao laid the foundation for a ₹20 lakh health sub-center in Velturu.

వెల్టూరులో హెల్త్ సబ్ సెంటర్ భవనానికి శంకుస్థాపన

వెల్టూరు గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ. 20 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తయ్యితే స్థానికులకు అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, స్థానిక…

Read More
Jogulamba Gadwal medical students launched a family adoption program, monitoring the health of five families each.

గద్వాలలో మెడికల్ విద్యార్థుల కుటుంబ దత్తత కార్యక్రమం

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు శనివారం ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. “కుటుంబ దత్తత” పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు, గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రతి విద్యార్థి ఐదు కుటుంబాలను దత్తత తీసుకొని, వారి ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు…

Read More
Fast-track court sentences the accused to one year in jail with a ₹2,000 fine for harassing a minor girl.

మైనర్ బాలిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడాది జైలు

ఎల్.బి.నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన నిందితుడు పల్లపు మహీంద్రను కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడు బాలికను అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసిక ఒత్తిడి కలిగించేలా మౌఖికంగా వేధించాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానానికి అప్పగించారు. ఈ కేసు క్రైమ్ నెంబర్ 283/2023గా నమోదై, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 354(D), 506 IPC & పోక్సో చట్టం సెక్షన్ 11, 12 కింద విచారణ జరిగింది. రంగారెడ్డి…

Read More
Anand Bhairavi’s 13th anniversary was celebrated grandly at Ravindra Bharati with cine celebrities, singers, and literary figures.

రవీంద్రభారతిలో ఆనంద భైరవి 13వ వార్షికోత్సవం ఘనంగా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, భాషా, సంస్కృతి శాఖల సౌజన్యంతో ఆనంద భైరవి సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ 13వ వార్షికోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సినీ నేపథ్య గాయని శ్రీమతి శారదా సాయి సమర్పించారు. ఈ వేడుకలో గౌరవ అతిథిగా కార్డు బాక్స్ కంపెనీ, ఆప్ సెట్ ప్రింటింగ్ మేనేజింగ్ పార్ట్నర్ భీమ్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్, గ్రీన్ మెట్రో ఇన్ఫోటెక్ హ్యాండ్…

Read More
A fire accident occurred at Kushaiguda RTC Depot, Medchal. Two buses were burnt, and authorities have begun an investigation.

కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం – రెండు బస్సులు దగ్ధం

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపివున్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకుని, దహనమయ్యాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన డిపో సిబ్బంది వెంటనే స్పందించారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లతో మంటలు అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. అయితే మంటలు పెరిగిపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు….

Read More