
నిర్మల్ మైనారిటీ గురుకులంలో 35 మంది విద్యార్థులు అస్వస్థత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాత్రి భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 35 మంది విద్యార్థులను పాఠశాల సిబ్బంది వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందించి, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హాస్టల్ ప్రాంగణంలోనే మెడికల్ క్యాంపు నిర్వహించి, మరికొందరు విద్యార్థులకు అక్కడే వైద్యం అందజేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారి రాజేందర్…