ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీస్ ల అధికారుల పర్యటన
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్ర సర్వీస్ ల అధికారులు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం పర్యటించారు. నాలుగు రోజులపాటు గ్రామంలో పర్యటించనున్న ఆరుగురు సభ్యుల బృందం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మొదటి రోజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సౌకర్యాలను వారు పరిశీలించారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో మాట్లాడిన బృందం సభ్యులు ప్రభుత్వం నుండి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ…
