Illegal red soil excavation in Palata forest using JCBs raises concerns as locals accuse forest officials of negligence and inaction.

పాలాట అడవిలో ఎర్ర మట్టి అక్రమ తవ్వకం, రవాణా వివాదం

మనోహరాబాద్ మండలం పాలాట గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎర్ర మట్టి అక్రమ తవ్వకం జరుగుతోంది. జేసీబీ యంత్రాల సహాయంతో తవ్విన మట్టిని టిప్పర్ల ద్వారా రవాణా చేస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న ఈ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శల పాలవుతోంది. స్థానికుల ఫిర్యాదుల ప్రకారం, ఈ తవ్వకాలు అటవీ ప్రదేశాన్ని హాని కలిగించే ప్రమాదం ఉందని, ఈ అంశంపై ఫారెస్ట్ అధికారులకు…

Read More
Congress government’s actions against tribals in Lakchera are criticized. Leaders demand immediate release of tribals arrested for opposing land acquisition for a pharma company.

గిరిజనులపై కేసులు పెట్టడం సమంజసం కాదని రాజు వ్యాఖ్యలు

గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వారి పై కేసులు పెట్టడం చాలా బాధాకరమని చిన్న శంకరంపేట మండల అధ్యక్షులు రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గిరిజనుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని ఆశించి గెలిపించిన గిరిజనులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని వ్యాఖ్యానించారు. కొంతమంది లగచర్ల బాదిత గిరిజనుల పరామర్శ కోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల ముందస్తు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు బీఆర్ఎస్…

Read More
SI Narayana Gowd warns farmers about accidents from drying rice on roads and urges vigilance against cyber crimes. Cases will be filed against those responsible.

రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు

రోడ్లపై ధాన్యం అరబెట్టడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో ఎవరివైతే ధాన్యం ఉంటుందో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం జరుగుతుందని దీంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు…

Read More
Farmers allege Narsingi PACS procurement center cheats in weighing paddy, causing losses. Officials urged to act on mismanagement and fraud.

నార్సింగి పిఎసిఎస్ ధాన్యం తూకంలో మోసాలు, రైతుల ఆందోళన

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన రైతుల పై ఆగ్రహానికి వస్తున్నారని రైతులు అంటున్నారు. సన్న రకం ధాన్యం జాలి పట్టి తూకం వేయాల్సి ఉండగా పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో జాలి మిషన్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో రైతులు ఒక్క బస్తాకు సుమారు రెండు కిలోల వరకు ధాన్యం నష్టపోతున్నారు….

Read More
Mandal Agricultural Officer Raj Narayana advises farmers to avoid burning crop residues, emphasizing the environmental and soil health benefits. He highlights the importance of maintaining soil fertility for better crop yield.

రైతులకు పంట అవశేషాలపై రాజ్ నారాయణ సూచనలు

రైతులు పంట కోతలు పూర్తయిన తర్వాత రామాయంపేట మండలంలోని పలు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ కోత కోసిన పొలాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరి పంటలో వరి కోత కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను అక్కడక్కడ తగలబెట్టడం వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా దెబ్బతింటుంది.ఈ విధంగా తగలబెట్టడం…

Read More
A psycho killer responsible for multiple murders in Medak district has been arrested. Police recovered gold, phones, and a laptop from him.

చిన్న శంకరంపేటలో సైకో కిల్లర్ అరెస్ట్

మెదక్ జిల్లా చిన్న శంకరం పేట వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ ను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్ కు తరలించారు. మెదక్ జిల్లాలో రెండు హత్యలు రాష్ట వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దారుణ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులను హత్య చేసింది ఒకే వ్యక్తి, చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టే మల్లేశం అలియాస్ (గొల్ల మల్లేష్). అక్టోబర్ 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హత్యకు గురైన వ్యక్తి…

Read More
Social worker Ayitha Paranjyothi and Vadla Naveen celebrated Vadla's birthday by donating chairs and tables to Anganwadi centers, bringing joy to children.

చిన్నారులకు వడ్ల నవీన్ పుట్టినరోజు సందర్భంగా కుర్చీలు పంపిణీ

చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ లు అందజేశారు. ఈ సందర్భంగా అయిత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారికోసం ఎంత చేసిన తక్కువేనని తెలిపారు. చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు…

Read More