Former MPTC Vinod Prabhakar urged Congress to grant an MLC ticket to Shabbir Ali, citing his decades of party loyalty.

షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు

మాచారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ రావుల వినోద ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహమ్మద్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే షబ్బీర్ అలీ, షబ్బీర్ అలీ అంటేనే కాంగ్రెస్ అని, గత 40 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ అసెంబ్లీలో షబ్బీర్ అలీ పేరును ప్రస్తావించారని, బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని పలుమార్లు ఆహ్వానించారని తెలిపారు. అయినప్పటికీ…

Read More
Urban Money Pvt Ltd office opened in Kamareddy, offering various loan services.

కామారెడ్డిలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ మేనేజర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ఈ సంస్థ సేవలను ప్రారంభించడంతో స్థానిక ప్రజలకు అనేక రకాల లోన్లు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ మాట్లాడుతూ, సంస్థ ద్వారా పర్సనల్ లోన్,…

Read More
Devotees gathered in large numbers at Omkareshwara Temple in Kamareddy for Maha Shivaratri, performing special poojas and Pallaki Seva.

కామారెడ్డి ఓంకారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో గల ఓంకారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అర్చకుడు అవినాష్ పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలంకారంతో అలంకరించి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని శివుడి కృపకు పాత్రులయ్యారు….

Read More
Devotees thronged Maddikunta’s Bugg Rama Lingeshwara Swamy Temple for Maha Shivaratri, witnessing a grand Kalyanam celebration.

మద్ధికుంటలో బుగ్గ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్ధికుంట గ్రామ దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఆలయం నిండా శివనామ స్మరణలతో మారుమోగింది. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల ఉత్సాహం మిన్నంటింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మమ్మద్ షబ్బీర్ అలీ, లోయపాటి నర్సింగరావు, దేవాలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి పాల్గొన్నారు….

Read More
Devotee numbers are increasing at Maddikunta Bugga Ramalingeshwara Temple, with the committee ensuring better facilities.

మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామం దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఈ పవిత్ర స్థలానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్నారు. ముక్కోటి ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది. గత ఏడాది ఆలయాన్ని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది….

Read More
Police destroyed 65 noisy motorcycle silencers with a road roller in Kamareddy, warning strict action against violators.

కామారెడ్డిలో 65 మోటార్‌సైకిల్ సైలెన్సర్ల ధ్వంసం

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందిరా చౌక్ వద్ద ఇటీవల అధిక శబ్దం కలిగించే మోటార్‌సైకిళ్లను పోలీసులు గుర్తించారు. గత రెండు నెలలుగా పట్టణవ్యాప్తంగా సైలెన్సర్ తీసిన బైకులపై కేసులు నమోదు చేసి, మొత్తం 65 సైలెన్సర్లను సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన సైలెన్సర్లను ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. ఆయన మాట్లాడుతూ, అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే మోడిఫైడ్…

Read More
On Gampa Govardhan's birthday, blankets and food packets were distributed to the poor as part of a charity event.

గంప గోవర్ధన్ పుట్టిన రోజు సేవా కార్యక్రమం

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన పార్టీ నాయకులు మరియు అనుచరులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ పట్టణ మైనారిటీ జనరల్ సెక్రెటరీ షేక్ అబ్దుల్ మాజీద్ ఆధ్వర్యంలో చేపట్టారు. గంప గోవర్ధన్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని రాత్రి 10 గంటల సమయంలో నిరుపేదలకు దుప్పట్లను, భోజన ప్యాకెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, కార్యక్రమం నిర్వహించిన వారు గంప గోవర్ధన్ గారి ఆదేశాల…

Read More