McDonald's signs a deal with Telangana to establish a Global India Office in Hyderabad.

హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్‌డొనాల్డ్స్, తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా ఆఫీస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా 2,000 మందికి పైగా ఉద్యోగాలు అందించనున్నట్లు మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మెక్‌డొనాల్డ్స్ చైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు పలువురు ప్రతినిధులు సమావేశమై ఈ ఒప్పందంపై చర్చించారు. ఈ ఒప్పందం ద్వారా మెక్‌డొనాల్డ్స్ తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు అవసరమైన…

Read More
Fraudster using matrimonial sites for scams arrested. Jubilee Hills police nabbed him in Bengaluru.

మ్యాట్రిమోనీ మోసగాడు అరెస్ట్ – హైదరాబాద్ పోలీసుల చర్య

అమ్మ అమెరికాలో పెద్ద డాక్టర్, ఎన్నారై అంటూ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసం చేసే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి 2014లో బీటెక్ చదవడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే, మధ్యలోనే చదువు ఆపేసి ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, జూదాలకు అలవాటు పడాడు. క్రమంగా మోసాల దారిలోకి వెళ్లి, ఉద్యోగాల పేరుతో జనాలను మోసం చేసిన కేసులో కూడా గతంలో…

Read More
Sri Kommuri Charitable Trust honored women for their outstanding service on International Women's Day.

రవీంద్రభారతిలో మహిళా సేవా పురస్కారాల ప్రదానం

హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 13న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు సేవా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా ఆనంద్, సృజన, పరుచూరి, జమున, డాక్టర్ వంగా ప్రసాద్, తీగల సత్యం, గంగి మల్లేశం హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని,…

Read More
Discover Hyderabad’s unique facts, secret routes, and famous landmarks in this video. Explore the city’s rich history now!

హైదరాబాద్ అద్భుతాలు.. నగరంలోని ఆసక్తికరమైన విషయాలు!

హైదరాబాద్ మనదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నగరం, జీహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నగర జనాభా కోటి దాటిపోయి, రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఇక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నవాళ్లకే తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హైదరాబాద్ రహదారులు, గల్లీలకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పురాతన చారిత్రక ప్రదేశాలు, ఆధునిక నిర్మాణాలతో కలిపి నగరం ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. చార్మినార్,…

Read More
Telangana government has decided to develop Yadagirigutta Temple with a TTD-like trust board, receiving cabinet approval for the same.

యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు!

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనితో యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి లభించనుంది. అయితే, ఆలయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కొనసాగనుంది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు, పదవీకాలం, నిధుల నిర్వహణ, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను మంత్రివర్గం పరిశీలించింది. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాప్టర్…

Read More
A Qatar Airways flight made an emergency landing in Hyderabad after a passenger suffered a heart attack but succumbed despite medical aid.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన క్యూఆర్-642 విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ విమానం దోహా నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళుతుండగా, ఒక మహిళా ప్రయాణికురాలు గుండెపోటుకు గురైంది. తక్షణమే విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించడంతో, అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరారు. సంబంధిత శాఖలు అనుమతినిచ్చిన వెంటనే మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పటికే విమానాశ్రయ సిబ్బంది, వైద్య…

Read More
A human trafficking gang smuggling newborns from Ahmedabad was busted by SOT Malkajgiri and Chaitanyapuri police, rescuing four infants.

హైదరాబాద్‌లో శిశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చిన్నారులను అక్రమ రవాణా చేస్తూ అమ్ముతున్న ముఠాను ఎస్ఓటీ మల్కాజిగిరి, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో 11 మంది సభ్యులను పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు చిన్నారులను రక్షించారు. రాచకొండ సీపీ జి.సుధీర్‌బాబు ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. పిల్లలను అమ్మే ముఠా మగబిడ్డలను నాలుగు నుంచి…

Read More