The Kalyanam of Sri Lakshmi Venkateswara Swamy was grandly conducted at Barampur as part of Brahmotsavam, with a large number of devotees attending.

బరంపూర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దేవి-భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకులు స్వస్తిక్, వేణుగోపాల శర్మ, నేరెళ్ల కళ్యాణ్ వేద మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో వరుడు తరపున బరంపూర్ వాస్తవ్యులు మెరుగు మోహన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వధువు తరపున…

Read More
Collector Rajarshi Shah participated in Indervelli's Tribal Cultural Meet and joined students in Gussadi dance performances.

ఇంద్రవెల్లి లో ట్రైబల్ కల్చరల్ మీట్ ఘనంగా

ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రైబల్ కల్చరల్ మీట్ 2024-25 కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు చిత్రించిన ఛాయచిత్రాలను తిలకించి వారికి అభినందనలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు….

Read More
Congress leader Kandi Srinivas Reddy slammed the Union Budget for ignoring Adilabad, leading a massive protest and burning budget copies.

కేంద్ర బడ్జెట్‌పై ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ…

Read More
A two-minute silence was observed at the school in Indravelli mandal on the occasion of Mahatma Gandhi's death anniversary.

గాంధీ జీ వర్థంతి సందర్బంగా ఇంద్రవెల్లిలో మౌనం

మహాత్మా గాంధీ జీ వర్థంతి సందర్భంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెన్లాపూర్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ గారి సేవలను గుర్తిస్తూ, ఆయన చేసిన భవిష్యత్తుకు దోహదపడిన సేవలను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా గుర్తించాలని” అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్,…

Read More
Farmer Maila Narsayya from Vartamannur ended his life due to debt burden after loan waiver was denied.

రుణభారం తాళలేక ఆదిలాబాద్ రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన రైతు మైల నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీరక, రుణమాఫీ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని మానసికంగా కుంగిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నర్సయ్య వరుసగా క్షేత్రాల్లో నష్టపోతూ వస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. రుణభారం ఎక్కువ కావడంతో కుటుంబ పోషణ కష్టమైపోయిందని, ప్రభుత్వ సహాయం అందకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన…

Read More
Minister Seethakka emphasized completing beneficiary verification by the 24th, ensuring welfare schemes reach all eligible people efficiently.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు – మంత్రి సీతక్క

నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందేలా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో సర్వే చేయించి, ఈ నెల 24లోగా పూర్తి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. రేషన్…

Read More

సంక్షేమ పథకాల సర్వేను సమగ్రంగా పరిశీలించిన జిల్లా పాలనాధికారి

జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలంలో రాయిగూడ, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి, 21న గ్రామసభల్లో జాబితా ప్రవేశపెట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా తయారు చేయాలని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, DLPO ఫణీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More